ప్రపంచంలో ఏది జరిగిన దానికి మూల కారణం నేనే అని చెప్పుకునే
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన ఎం.ఎల్.ఎ రేవంత్ రెడ్డి
అరెస్ట్ అయిన 24 గంటల లోపే దానికి కారణం నేను అని ఒప్పుకున్నాడు.
కంప్యూటర్, సెల్ ఫోన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లై ఓవర్లు, రోడ్లు
, బిల్డింగులు, చెడ్డి లు , బనీన్ లు, సైకిల్, కార్లు, లారీలు, విమానాలు అట్లా
ప్రపంచం లోనే సకల వస్తువులను కనిపెట్టిన తరువాత, "వోట్ కు నోట్" అనే దాన్ని చాల
ముందు చూపుతో అబివృద్ధి చేసిన సూత్రానికి చంద్రబాబు నాయుడు గారి పేరు శాశ్వితంగా
ఉండాలి అని ఉద్దేశం తో ఒప్పుకునట్టు తే.దే.పా కార్యకర్తలు సమర్ధించుకుంటున్నారు.
వోట్ కు నోట్ అనే సూత్రానికి బాగా ప్రచారం చేసి దానికి ఒక
నిర్దిష్ట లక్షం, రూపం ఇచ్చి దానిపై అందరికి శిక్షణ తరగతులు ఇప్పించిన మహాను భావుడు
చంద్ర బాబు నాయుడు గారు అని కార్యకర్తలు గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కడ గూడా 'వోట్ కు నోట్' అనే విషయం
వచ్చిన ప్రతి సరి దాన్ని "చంద్రబాబు నాయుడు వోట్ పథకం" అనే పేరుతో పిలువాలి అని
గుర్తించి, ఐక్య రాజ్య సమితి లో దీనిపై తీర్మానం చెయ్యాలి అని అన్న కార్యకర్తల
కోరిక మేరకు తను ఎం.ఎల్.ఎ రేవంత్ రెడ్డి అరెస్ట్ కు మూల సుత్రదారున్ని అని
ఒప్పుకుంటున్నాను అని చెప్పిండు.
Disclaimer: The above Telugu article (unless
explicitly and clearly mentioned) is a work of fiction. Readers are advised to
read it in right spirit and not confuse the content with real happenings. Even
if it resembles someone, it's probably just a coincidence.
No comments:
Post a Comment