Pages

Saturday 31 October 2015

ఇస్లామిక్ స్టేట్ తీవ్ర వాద సంస్థ ను సమర్దిస్తున్న వార్త విశ్లేషకులు

వేణుగోపాల స్వామి గారు నమస్తే తెలంగాణా పత్రికలో 14-అక్టోబర్-2015 నాడు "ఉద్యమకారుల ఊరేగింపు "  అనే పేరు మీద రాసిన వ్యాసం తెలంగాణా పాఠకులను తప్పు దోవ పట్టించే విదంగా ఉంది.

దాంట్లో వేణుగోపాల స్వామి గారు రాస్తూ ఇస్లాం మతం ఆపదలో ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవాలని అనే ఉద్దేశం తో ఉన్న వారు  ఐ ఎస్ లో సభ్యులుగా  చేరి పోట్లాడటం లో తప్పు లేదు, వాళ్ళు చేసే త్యాగాలను గూడా కించ పరచ వద్దు అని చెప్పుతునారు. ప్రపంచం నలుమూలల నుంచి ముస్లిం లు ఐ ఎస్ తరుపున పోరాడడం లో తప్పు లేదు అని బోధిస్తాన్నురు.

namasthe telangana 14 oct1

దీని ద్వార ఏమి అర్ధం చేసుకోవాలి, ఇస్లాం కు తీవ్రవాదానికి సంబంధం ఉండడంలో తప్పు లేదు అని చెప్పాలి అనుకుంటున్నారా, లేదా ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తుంటే దాన్ని మతం కోణంలో చూడామణి చెప్తున్నట్టా.. మీరు ఎ దేశం నాగరికులు అయిన సంబధం లేదు కానీ యుద్ధం చెయ్యవలసి వచ్చు నప్పుడు మాత్రం మతం ఆధారంగా చెయ్యమని చెప్పుతున్నట్టా? 

కానీ సమాజం లోని కొంత మంది పెద్ద మనుషులు ఐ ఎస్ అనేది ఒక తీవ్రవాద సంస్థ. మతాన్ని దానితో ముడిపెట్టడం సరికాదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇస్లాం కి వ్యతిరెంకంగా పని చేస్తున్నారు అన్నట్టు మనం వింటూ ఉన్నాము.  ఇది మనం సర్వ సాదారణంగా అన్ని వర్గాల నుండి వినే మాటలు. దీని మీద కొంత మంది ముస్లిం లు  కూడా ఐ ఎస్ కు ఇస్లాం కు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు.

ఒక మత పరంగా, లేదా దేశ పరంగా జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర అని చెప్పుతూ, ఈ రెండు విషయాలకు ఎలాంటి సంబందం లేని తెలంగాణా విషయాన్నీ జోడించి విశ్లేషణ పేరు మీద సమాజాన్ని తప్పు దోవ  పట్టిస్తున్నట్టు కనపడుతుంది.

ఇప్పుడు వ్యాసకర్త వేణుగోపాల స్వామి గారు చెప్పింది నిజామా, లేదా మిగితా సమాజం చెప్పింది తప్పా?

ఇంలాంటి విశ్లేషణల ద్వార తెలంగాణా ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు?  

మతానికి తీవ్రవాద సంబధం ఉండడం లో తప్పు లేదు అని చెప్పాలి అనుకుంటున్నారా?

ఇట్లాంటి వాళ్ళ రాతలల్లో ఏమైనా కుట్ర దాగి ఉందా? 

అ రోజు వచ్చిన పూర్తి వ్యాసం

namasthe telangana 14 th october

వీరు మేధావులా? వెర్రి గొర్రెలా?!

 

సర్వానందకౌల్ ప్రేమి పేరు మోసిన కాశ్మీరీ కవి. అనంతనాగ్ జిల్లా సోఫ్‌షాలి గ్రామంలో అందరికీ ఇష్టుడై హిందువుల, ముస్లింల అభిమానాన్ని సమానంగా పొందిన పెద్దమనిషి. ఆయన పూజగదిలో ‘ఖురాన్’ పురాతన ప్రతి ఎప్పుడూ ఉండేది. ‘‘బతకాలని ఉంటే ముస్లింలుగా మారండి... లేదా కాశ్మీర్ లోయ వదిలి 24 గంటల్లో పారిపొండి’’ అని లోయ అంతటా అస్తమానం మసీదుల్లో మైకుల నుంచి అరుస్తున్నారు; ‘పారిపోకపోతే చంపేస్తామ’ని హిందువుల ఇళ్లూ, దుకాణాల మీద నోటీసులు అంటించారు. ఇప్పటికే వందల మందిని చంపేశారు. మనమూ వెళ్లిపోదాం - అని భార్యాబిడ్డలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నా తమ జోలికి ఎవరూ రారని ప్రేమీజీ నిబ్బరంగా ఉంటుండగా...


1990 ఏప్రిల్ 29 రాత్రి ముస్లిం మిలిటెంట్లు ఆయన ఇంటి మీద పడ్డారు. ఇంట్లోని విలువైన వస్తువులు, నగా నట్రా అంతటినీ సూట్‌కేసులో పేర్చి, దాన్ని పెద్దాయన నెత్తిమీదే పెట్టి మోయిస్తూ తమ వెంట తీసుకుపోయారు. రెండురోజుల తరవాత ఆయన శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ప్రేమీజీ ఒళ్లంతా సిగరెట్ వాతలు, నుదుట తిలకం బొట్టు ఉండేచోట మేకుతో కొట్టిన రంధ్రం! కనుగుడ్లు పీకి చర్మం ఒలిచి కాల్చి చంపిన గుర్తులు.


ఈ వార్త దేశంలోని చాలా పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. అయినా ఒక్క మేధావీ చలించలేదు. సాటికవిపై జరిగిన ఘాతుకానికి, ఆయనను బలిగొన్న మతద్వేషానికి, అసహిష్ణుతకు నిరసనగా ఒక్క సాహిత్యకారుడూ అకాడమీ అవార్డును వెనక్కి ఇస్తున్నానన లేదు. వేల సంవత్సరాల నుంచీ తరతరాలుగా నివసిస్తున్న గడ్డనుంచి కాశ్మీరీ పండిట్లు లక్షల సంఖ్యలో పారిపోయి, తమ దేశంలో తామే ప్రవాసులై పావు శతాబ్దంగా పడరానిపాట్లు పడటానికి కారకులైన ముస్లిం మతోన్మాదులను పల్లెత్తుమాట అనడానికి దేశంలోని ఏ సెక్యులరిస్టుకూ, ఏ లెఫ్టిస్టుకూ, ఏ పాచినోటి నీతుల రాయుడికీ నోరు పెగలలేదు. లోయలోని హిందువుల ఇళ్లపై వందల మంది విరుచుకుపడి కళ్లు పీకడం, బతికుండగానే చర్మం వొలవడం, నోట్లో మూత్రం పోయడం, స్ర్తిలను చెరచడం లాంటి రాక్షసకృత్యాలు ఎన్ని చేసినా సహిష్ణుత, మానవత్వం వగైరాలు మంటగలిశాయని ఒక్క కళాకారుడూ కన్నీటి బొట్టు విడవలేదు.


అదే - ఈ మధ్య దాద్రీ అదే ఊళ్లో ఒక మహమ్మదీయుడి ఇంటి మీద హిందువులు దాడిచేసి చంపేశారనేసరికి ఎక్కడెక్కడి మహానుభావులూ సెక్యులర్ పూనకంతో ఊగిపోతున్నారు. దాద్రీలో జరిగింది క్షమించరాని, కఠినాతికఠినంగా శిక్షించవలసిన దురాగతం అనడంలో సందేహం లేదు. కాని ఆ ఘటనలో మరణించిన అఖ్‌లాక్‌ను తలచుకుని శోకాలు పెడుతూ, రంకెలు వేస్తున్న వామపక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్, లిబరల్ తక్కుంగల మేధావి గణాలకు అదే ఉత్తరప్రదేశ్‌లో అదే దాద్రీకి దగ్గరలో ఇంచుమించుగా అదే కాలంలో కుప్‌గాంవ్ అనే ఊళ్లో ముస్లింలు కాల్చి చంపిన సంజు రాఠోడ్ అనే 15 ఏళ్ల బాలుడి సంగతి పట్టలేదు. దాద్రీలో ఆవును చంపినందుకు హిందువుల చేతిలో హతమైనట్టు చెప్పబడుతున్న అఖ్‌లాక్ నామస్మరణ చేస్తూ గావుకేకలు పెడుతున్న మహాత్ములకు అదే నెలలో మంగుళూరు దగ్గర మూదబిద్రిలో అక్రమ కబేళాలకు, విచ్చలవిడి గోవధకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రశాంత్‌పూజారిని ఆరుగురు మహమ్మదీయులు మోటారు సైకిళ్లమీద వచ్చి నడివీధిలో కాల్చి చంపటంలో మతద్వేషం, అసహిష్ణుత అణువంతైనా కానరాలేదు. ఆ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన వామన్‌పూజారి పాకిస్తాన్ ఫోన్ నెంబర్ల నుంచి వరసగా వస్తున్న బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఆందోళన చెందాల్సింది ఏమీ వారికి కనిపించలేదు.


ఇస్లామిక్ మతవాదుల వ్ఢ్యౌన్ని ధైర్యంగా ఎదిరించిన రచయిత్రిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తస్లిమా నస్రీన్ తల నరికిన వారికి ఐదు లక్షల రూపాయల బహుమానాన్ని ముస్లిం మతపెద్దలు ప్రకటించడం హేతువుకు, సహిష్ణుతకు, మానవ హక్కులకు ప్రమాదంగా మన గావుకేకల బ్యాచికి తోచలేదు. ప్రాణభయంతో వచ్చి ఆమె తలదాచుకున్న కోల్‌కతా నుంచి కూడా ముస్లిం మతవర్గాల దాష్టీకానికి తల ఒగ్గి, వామపక్ష, ప్రగతిశీల విశుద్ధాత్ముల ప్రభుత్వం ఆమెను వెళ్లగొట్టటానికి నిరసనగా ఒక్క సాహిత్యకారుడూ ‘అవార్డ్ వాపసీ’ ప్రోగ్రాం పెట్టలేదు. హైదరాబాదులో ఆమె పుస్తకావిష్కరణ సభలో ముస్లిం లెజిస్లేటర్లు మూకను వెంటేసుకుని దారుణంగా దాడిచేయటం భావస్వేచ్ఛకు, మత సహిష్ణుతకు, హేతువాదానికి, సెక్యులర్ జీవన విధానానికి అపచారమని ఇప్పుడు గగ్గోలు పెడుతున్న వారిలో ఏ ఒక్కడూ బాహాటంగా ఖండించిన పాపాన పోలేదు. ఇండియాకు శత్రువైన పాకిస్తాన్ వాడిని ఇండియాకు పట్టుకొచ్చి పుస్తకావిష్కరణ సభ పెట్టించిన సుధీంద్ర కులకర్ణి అనేవాడి మొగాన సిరా పోయడం నిష్కృతి లేని నేరమంటున్న వాచాలురకు ప్రెస్ కాన్ఫరెన్సులో రాందేవ్ బాబా మొగాన ఒక మహమ్మదీయుడు సిరా కుమ్మరించడంలో అనౌచిత్యం ఏమీ కనిపించలేదు.


మూడేళ్ల కింద ముంబయి శివార్లలోని క్రైస్తవ ప్రార్థనా స్థలంలో ఏసుక్రీస్తు విగ్రహం కాలివేళ్ల నుంచి నీటిబొట్లు రాలసాగాయి. అది దేవుడి మహిమగా ఆ మతం వాళ్లు ప్రచారం చేసుకున్నారు. ఎక్కడెక్కడి భక్తులూ ఎగబడి కారేనీరును పవిత్ర తీర్థంగా పుచ్చుకుంటుండగా దాని సంగతి తేలుస్తానని ఇదమరుకు అనే హేతువాద ప్రముఖుడు ముందుకొచ్చాడు. ఒక ఇంజనీరుతో పరీక్ష చేయించి, ఏసు విగ్రహం అమర్చిన గోడలో ప్లంబింగ్ లోపంవల్ల డ్రయినేజి నీరు ఊరుతున్నందువల్లే అలా జరిగిందని శాస్ర్తియంగా నిరూపించాడు. దానిపై దరిమిలా ఒక టీవీ చానల్ స్టూడియోలో క్రైస్తవ మతస్థులతో అతడు వాదులాడుతుండగా కేథలిక్కులు కట్టెలు పట్టుకుని అతడిని కొట్టటానికి స్టూడియో బయట గుమికూడారు. ఆ గండం నుంచి ఎలాగో బయటపడ్డా, అతడి మీద క్రైస్తవులు మూడు పోలీసుస్టేషన్లలో క్రిమినల్ కేసులు పెట్టారు. ముందస్తు బెయిలు మంజూరు కాలేదు. జైలుకు వెళ్లినా చావు తప్పదని బెదిరింపులు ఎక్కువయ్యాయి. దాంతో ఇదమరుకు ప్రాణం దక్కించుకోవడానికి ఏదో మిషమీద ఫిన్లాండ్ పారిపోయాడు. స్వదేశానికి క్షేమంగా తిరిగి రాగల శుభదినం కోసం అతడు మూడేళ్లుగా హెల్సింకీలో ఎదురుచూస్తున్నాడు. నిందితులు క్రైస్తవ మైనారిటీలు కాబట్టి, ఆ హేతువాదిని అలా సతాయించడం హేతువుపై దాడిగా మన మహాహేతువాదులకు అనిపించలేదు. ఏ ఒక్కడూ ఒక్క పనికిమాలిన అవార్డునూ వదిలిపెట్టలేదు.

పోనీ- ఇప్పుడు వారు అనునిత్యం స్మరిస్తున్న ముగ్గురు హిందూ వ్యతిరేకులనైనా హిందూ మతోన్మాదులే చంపారనడానికి ఆధారాలున్నాయా? అంధ విశ్వాసాలను ఎదిరించటమే పనిగగా పెట్టుకున్న నరేంద్ర దభోల్కర్‌కు శత్రువులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి’ పేరిట మదర్ థెరిసా మహిమల బండారాన్ని ఆయన బయట వేశాడు. ఆమెను సెయింట్‌గా గుర్తించవద్దంటూ పోప్‌కు ఉత్తరం రాసి క్రైస్తవ వర్గాలకు కంటగింపు అయ్యాడు. దభోల్కర్‌ను చంపి రెండేళ్లయినా మోటారు సైకిళ్ల మీద వచ్చి అతడిని హతమార్చిన వారెవరన్నది తేల్చడం పోలీసుల తరం కాలేదు. అంజనం వేసి హంతకుడిని కనిపెట్టటానికి వారు ఒక తాంత్రికుడిని ఆశ్రయించారుగానీ ప్రయోజనం లేకపోయింది. అయితే నరేంద్రమోదీయే ఉసిగొలపగా హిందుత్వం వాలాలే దభోల్కర్‌ను పొట్టన పెట్టుకున్నట్టు మన హేతువాద, సెక్యులర్ గణాలు మాత్రం అంజనం వేయకుండానే దివ్యదృష్టితో కనిపెట్టాయ.

దభోల్కర్ చేతిలో శృంగభంగమైన వారిలో అమాంబాపతు బాబాలూ, నకిలీ స్వాములూ, లేకపోలేదు... తమ దారికి అడ్డొచ్చిన వారిని అంతమొందించాలని వారిలో ఎవరైనా అనుకుని ఉండరు అనటానికి వీల్లేదు. తమ ఆధ్యాత్మిక వ్యాపార స్వార్థం కోసం అలాంటి వారెవరైనా కక్షగట్టి ఒకవేళ అతడిని చంపించి ఉన్నా, ఆ పాపాన్ని హిందుత్వానికి కట్టుబడే శక్తులకు ఆపాదించడం న్యాయం కాదు. నకిలీ బాబాలు, కపట స్వాములు, విబూదుల, తాయెత్తుల, గారడీల మాయగాళ్లు అందరిదీ ఆరెస్సెసే కేరాఫ్ అడ్రసు అనో, వారంతా బిజెపి చేతిలో ఉన్నారనో నమ్మేసి, అభాండాలేసే వారి బుర్రలను అర్జంటుగా డాక్టరు పరీక్ష చేయించాలి.

అలాగే కమ్యూనిస్టు పార్టీకి చెందిన గోవింద్ పన్సారే ఎప్పుడో గాడ్సేను తిట్టాడు కనుక, హిందువులందరూ గాడ్సే భక్తులు కాబట్టి, హిందుత్వ శక్తులే అతడిని చంపించినట్టు మన మతి చెడ్డ మేధావుల దుష్ప్రచారం. కాని - పన్సారే హిందూ వ్యతిరేక నాస్తిక హేతువాది మాత్రమే కాదు. అడ్డగోలుగా టోల్‌టాక్సు వసూలు చేస్తున్న కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి, పెద్ద ఉద్యమం నడిపినవాడు. మహారాష్ట్ర ప్రభుత్వ ఎస్.ఇ.జడ్. విధానంపై ధ్వజమెత్తి, ప్రజల భూములు అప్పనంగా కాజేస్తున్న వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు ప్రబల శత్రువు అయినవాడు కూడా. అతడిని హిందుత్వ వాదులే చంపారు; అతడి హత్యలో ఇంకో కోణం ఏదీ లేదు అని మన బుద్ధిలేని బుద్ధి జీవులకు హత్య జరిగిన ఆర్నెల తరవాత హఠాత్తుగా జ్ఞానబోధ ఎలా అయింది? ఎవరు చేశారు? కర్ణాటకలో కల్బుర్గి హత్యలో కుటుంబ ఆస్తి గొడవల కోణంకూడా కొట్టివేయటానికి వీల్లేదని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులే చెబుతుండగా మోదీ పురమాయింపు మీద హిందుత్వ శక్తులే ఆ హత్య చేసినట్టు మన ‘సెక్యులర్’, ‘హిందూ వ్యతిరేక’ హేతువాద మేథావిగణం ఏ దివ్యదృష్టితో కనిపెట్టింది?

మోదీ అధికారంలోకి రావడానికి దాదాపు సంవత్సరం ముందు జరిగిన దభోల్కర్ హత్యతో మోదీ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? పోలీసు, ప్రజాభద్రత రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. దభోల్కర్, పన్సారే, కల్బుర్గి హత్యలు జరిగినవి కర్నాటక, మహారాష్టల్ల్రో కాగా దాద్రీ ఖూనీ జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. కర్నాటక, యు.పి.ల్లో ఉన్నవి బిజెపి ప్రభుత్వాలేమీ కావు. సోకాల్డ్ హేతువాదులు, ఆవుల్ని తినేవాళ్లు ఎక్కడైనా హత్యలకు గురైతే వాటికి జవాబు చెప్పవలసింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. వాటినేమో వదిలేసి, కేంద్రంలోని మోదీ సర్కారు మీదే అమాంబాపతు మేధావుల గ్యాంగు తుపాకులు ఎక్కుపెట్టటంలోని ఆంతర్యమేమిటి?

దేశంలో ఇప్పటిదాకా జరిగిన, ఇప్పుడూ లెక్క లేకుండా జరుగుతున్న దొమీల్లో, మత ఘర్షణల్లో మరణించిన ఏ ఒక్కడికీ ఇవ్వనంత ‘‘45 లక్షల రూపాయల ప్లస్ నాలుగు అపార్ట్‌మెంట్ల’’ పరిహారాన్ని దాద్రీ బాధిత ముస్లిం కుటుంబం అందుకున్న తరవాత కూడా దేశంలో మైనారిటీలకు దిక్కులేదని, మత సహిష్ణుతకు నిలవనీడ పోయిందని - ఒక్క దాద్రీ చూరునే పట్టుకుని గుండెలు బాదుకుంటున్న వారిని మేథావులు అనాలా? ఎవరు ఎలా నడిపిస్తే అలా నడిచే వెర్రి గొర్రెలు అనుకోవాలా?

సహేతుక కారణం ఒక్కటీ లేనిచోట, అభాండాలు వేసి, కాకుల్లా కేకలు పెట్టి, జరగరానిదేదో జరిగిపోతున్నట్టు ప్రపంచానికి అపోహను రేకెత్తించడానికి ఈ స్థాయిలో ఇంత ప్రచార యుద్ధం ఎందుకు జరుగుతున్నది? ఎవరు చేయస్తున్నారు? బీహార్‌లో బిజెపి గెలిచి తద్వారా రాజ్యసభలో బొటాబొటి మెజారిటీ పొంది కీలక సంస్కరణలతో మోదీ ప్రభుత్వం ప్రజల మెప్పుపొందకుండా చేయడానికే కీలక ఎన్నికల అదనులో ఈ కాకిగోల అంతా! కాంగ్రెసు మాతాసుతులిద్దరికీ ప్రత్యక్ష అవినీతి ప్రమేయం ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసులో సుబ్రహ్మణ్య స్వామి పూనికవల్ల జైలుశిక్ష తప్పదనుకుంటున్న రోజులివి. ఆ పరాభవానికంటే ముందే మోదీ ప్రభుత్వాన్ని, అతడి పార్టీని బద్‌నామ్ చేసి, గోబెల్స్ తరహా దుష్ప్రచారంతో అనిశ్చితిని, అరాచకాన్ని తెచ్చిపెట్టటానికి కాంగ్రెసు, దానికి తోడుబోయిన చెల్లని పార్టీల ఆధ్వర్యంలో పెద్దకుట్ర జరుగుతున్నది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఐదేళ్ల పూర్తికాలం కొనసాగనివ్వకుండా మధ్యలోనే అధర్మంగా సాగనంపి, బందిపోట్ల స్వర్గమైన కాంగ్రెసు దొంగల రాజ్యాన్ని ఇటలీ మహారాణి సర్వం సహాధిపత్యంలో ఎంత త్వరగా మళ్లీ తీసుకురావాలా అని మిషనరీలు, ముల్లాలు, కామ్రేడ్లు, మోదీ మూలంగా నోటి కూడుపోయిన విదేశభక్త ఎన్జీవో రాయుళ్లు, వారివారి విదేశీ ప్యాట్రన్లు తహతహలాడుతున్నారు. వారు పథకం ప్రకారం తవ్విపెట్టిన గోతిలో బుర్రలేని సాహిత్యకారులు, గొర్రెల్లాంటి కళాకారులు, సినిమాల శాల్తీలు, చరిత్ర తెలియని చరిత్రకారులు కాంగ్రెసు జమానాలో ఉపకారాలు పొందిన శాస్తవ్రేత్తలు, సైన్యాధికారులు, న్యాయమూర్తులు కళ్లు తెరచుకునే పడుతున్నారు. అన్నీ తెలిసిన కాంగ్రెసు పెద్ద ప్రణబ్ ముఖర్జీయే దేశంలో మతసహిష్ణుత, హేతుబద్ధత, ప్లూరలిజాలకు కొంప మునిగిందంటూ ఈ మధ్య తరచూ పనిగట్టుకుని నొక్కి చెప్పటంలోని మతలబు ఏమిటి అని క్షణం ఆలోచిస్తే చాలు అసలు గుట్టు బోధపడుతుంది. సూడో సెక్యులరిస్టుల, మీడియా మాయావుల మాయాజాలంలో పడిపోయిన వారికి కళ్లు విచ్చుకుంటాయి... నిజాన్ని చూడాలన్న నిజాయతీ అనేది వారికి ఉంటేగింటే!

 

ఏం.వి.ఆర్ శాస్త్రి

ఆంధ్ర భూమి

Wednesday 28 October 2015

10 Reasons Why Some Hindus Suspect Many Muslims In India

In the midst of news, like growing religious intolerance, let us revisit the history to become more and better informed about history.

1. Millions of Hindus were killed for denying to convert to Islam by Muslim rulers who came from Middle-Eastern countries since Islam stepped into India. History of these people speaks volumes such incidents. Death of Guru Gobind Singh and his sons, Guru Tegh Bahadur, Hem Chandra Vikramaditya, Banda Bairagi, Rana Prathap, Prithviraj Chauhan, Vijayanagara Kings, Battle of Saraighat, Shivaji. 

                     guru tej bahadurshivajirana prathap

2. Almost all the Islamic rulers starting from Muhammad Ghuri, Khaljis, Tughlaqs, Amir Timur, Babur, Sher Shah Sur, Akbar, Jahangir Shah Jahan, Aurangzeb, Haidar Ali, Tipu Sultan, Hyderabad Nizams have actively encouraged forceful mass conversion of Hindus into Islam on the edge of sword or through programs like Tabliq.

spread of Islam

3. To hurt Hindu sentiments, then Islamic rulers deliberately destroyed, damaged then looted huge number of wealthy sacred Hindu temples across the country. Then rulers had an opportunity to build new mosques at unused lands to perform their rituals but they preferred to convert Hindu temples into mosques. Is it not conspiracy? Reference: Hindu Temples What Happened To Them Volume 1& 2.

what happened to Hindu temples

4. When Indian society was fighting for independence from British rulers, Muslim leaders and its followers played all the tricks and were successful in dividing Indian territory to form Pakistan.

paki

5. During Indian freedom fight surprisingly Muslims demand for Kalifia, which has nothing to do with Indian society. The programs like “Direct Action Day” in 1946  were organized by Muslim League Council, where Hindus were targeted then and killed in large numbers. Direct Action Day and killings of Hindus in Pakistan.

6. Silent ethnic cleansing of Hindus in Islamic Pakistan and Bangladesh countries. The drastic drop of Hindu population growth in Pakistan from above 30% (1947 to below 2% (2011)) and Bangladesh are matter of great concern. Reference: Quiet Case Of Ethnic Cleansing: The Murder Of Bangladesh's Hindus

quite case of Ethnic cleansing of Hindus In Bangladesh

7. The independent India is still facing the challenge of demographic siege from neighboring Muslim countries Pakistan and Bangladesh. Infiltration of illegal Muslim migrants into parts of Assam, West Bengal, pockets of Bihar, Jammu and Kashmir. Reference: Demographic Siege.

demographic_siege

8. Elite Muslim community leaders and preachers silence on uniform civil code, whenever Muslims actively indulge in anti national terror activities/issuing fatwas/ as well as waving Pakistan or terrorists (ISIS) flags in parts of the country, denying to respect the national symbols. Ex: The brutal killing of Hindus in Kashmir valley during 1989-1991.

jammu and kashmir

9. Many Muslims in India sympathize or show concern with the events happening in the Islamic countries and show their willingness and even they don’t hesitate even to sacrifice their lives in the name of religious cause at their lands and threatening speeches by MLA to kill Hindus within 15 minutes.  Reference: Media reports about Indian Muslims links with foreign-based anti-national terrorist organizations like ISIS, Lashkar-e-taiba, Al-queda, Taliban and SIMI.

owaisi

10. The imitation of present Indian Muslims dressing as Arabs on the Indian streets and school and college going Islamic youth asserting appearance, preference to Muslims only friends, incidents like Love Jihad, shows they are getting distanced gradually from main stream society.

Friday 9 October 2015

Why Media Silent When Dalit Family Stripped Naked By UP Police

Shocking to see the images on social media and knowing the facts that a dalit family was stripped naked by police when they approached to make a formal complaint of robbery at police station at Gautam Budh Nagar, Greater Noida, Uttar Pradesh.

dalit stripped

Its more than 24 hours, but elite Indian electronic and print media heads and their top journalists with cameras are missing or may be they are not able to locate the ground zero for reporting live coverage. Why?

Just few days ago, the same media have played major and important role in covering the mob killing of Mohammed Akhlaq (50) when he was alleged to have possessed or eaten the beef. Almost every one voiced their word and exposed it and ran marathon series of debates in TV studios and big editorials condemning the death of Akhlaq  in search of reasons and consequences. Well appreciated act by media. 

In addition, almost all the political parties visited the house of Akhlaq’s family and consoled the loss of life. The UP government also announced compensation to the family and assured to look after them in the future. All these gestures were need of the hour to strengthen the moral of the family.

But the same media heads who covered Dadri incident and their troupe have completely lowered their voice, or became mute as if they are dumb by birth, when a Hindu Dalit  family was stripped naked by police. Why? Is this not a news, or who is stopping them from reporting from ground zero and why politicians are practicing untouchable to this kind of incidents.

Moreover, the people who covered the news are very clever they are not questioning or making Uttar Pradesh government and its CM Akilesh Yadav accountable for failing to maintain law and order. 

WHY? Is it just because of the Hindu religion and dalit caste of the victims?

Telugu Media Channels Sakshi & TV9’s Secularism Questioned

 

Telugu media channels like Saskhi, TV9 and ABN Andhra Jyothi and several other channels are airing several programs questioning and holding debates on almost all major festivals and sentiments connected with day-to-day or occasional rituals of Hindus.

But surprisingly all these channels go mute on doing similar kind of debates and programs or questioning Islamic and Christian rituals or day-to-day affairs of this religious followers.

Some of the posts widely being shared on social media.

sakshi1

tv92

How Christianity divided family in performing the final funeral rights of a father by kids.

Will this can be topic for debate?

dividing people

Sunday 4 October 2015

Revolutionary Songs By Traitors In Telangana

A pen is mightier than sword/gun..

A timely article titled "వంచకుల విప్లవగీతాలు" by Katta Shaker Reddy in Namasthe Telangana paper on 4-October-15 has exposed the people chanting Maoism on this soil and who are encouraging others to swallow the expired and not prescribed medicine suitable for our conditions...


ఒక వర్గం మీడియా, సీపీఎంతో సహా కొన్ని రాజకీయపార్టీలు ఇప్పుడు విప్లవగీతాలు ఆలాపించవచ్చు. కానీ వారి చరిత్రను ఎవరూ తుడిపేయలేరు. మేము ప్రభుత్వాలను శాసిస్తాం. నడిపిస్తాం. కాళ్లదగ్గరకు తెచ్చుకుంటాం. ఎవరినయినా లొంగ దీసుకుంటాం అని భ్రమించిన మీడియా తెలంగాణలో అది సాగకపోయే సరికి భంగపడి విచ్చలవిడిగా తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నది. అందుకు ఏ సందర్భం దొరికినా అది వదలడం లేదు. మావోయిస్టులపై వారి విపరీత ప్రేమ కూడా అందులో భాగమే.

గద్దర్ వెన్నులో గన్ను దించినవాడికి దీపారాధనలు చేసేవారు, మెరికల్లాంటి మావోయిస్టు యోధులను ఎక్కడో పట్టుకొచ్చి తెలంగాణ గడ్డపై దారుణంగా కాల్చి చంపిన హంతక హస్తాలతో నిత్య కరచాలనం చేసేవారు, ఆంధ్ర రాష్ట్రం వచ్చీ రాగానే మావోయిస్టులను బలితీసుకున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్టును తన అక్షరా ల పల్లకీలో ఒహోం ఒహోం అని ఊరేగిస్తున్నవారు....

ప్రజల పేరుచెప్పి నక్సల్బరీ బిడ్డలను సజీవ దహనం చేసే విద్యను కనిపెట్టినవారు, మావోయిస్టుల ఎన్‌కౌంటర్లను కనిపెట్టిన రాజ్యానికి నాయకత్వం వహించినవారు, మమతా బెనర్జీ రాకముందు వరకూ కూడా మావోయిస్టులను కాల్చి చంపే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టినవారు....

చర్చల పేరుతో మావోయిస్టుల ఆనుపానులను కనిపెట్టి ఆనక రక్తపుటేరుల్లో ముంచిన మహానేత కరస్పర్శతోనూ, ముగింపు తెలియని ఉద్యమంలో ఉద్వేగంతో ఊగిపోతున్న యువకుల కరస్పర్శతోనూ ఏకకాలంలో పులకించిపోయే వంచక మేధావులు.... అందరూ తెలంగాణ గడ్డమీద ఇప్పుడు ఒకే భాష మాట్లాడుతుండడం, ఒకే బాటన నడుస్తూ ఉండడం విస్మయం కలిగిస్తున్నది.

మావోయిస్టుల సిద్ధాంతాలు, ఆశయాలు, త్యాగాలు, నిజాయితీ ఎంత గొప్పవయి నా కావచ్చు. అటువంటి త్యాగం అందరూ చేయలేరన్నదీ నిజం. సమాజంలో ఎంతో కొంతమందిలో అసంతృప్తి, నిరసన, పోరాటం అనివార్యంగా కొనసాగుతాయన్నదీ నిజం. కానీ వారు అనురిస్తున్న మార్గం తప్పా ఒప్పా అని చెప్పలేని మేధావులు వారిని కీర్తించడమే విషాదకరం. గతం నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం ప్రమాదకరం. నక్సల్బరీలో మొదలయిన వసంతకాల మేఘ గర్జనలు అక్కడ పలుచబడిపోయి శ్రీకాకుళం వచ్చాయి. అక్కడ కూడా ఆధునిక రాజ్య వ్యవస్థ ధాటికి తట్టుకోలేక ఓడిపోయి, బలహీనపడిపోయి, గోదావరి లోయకు పాకాయి. అక్కడా అదే అనుభవం. అక్కడి నుంచి ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లారు. అక్కడ కూడా ముగింపు తెలుస్తూనే ఉంది. మావోయిస్టులు నిర్మించుకున్న దుర్భేద్యత శాశ్వతం కాదు. పల్లెలను విముక్తి చేసి, పట్టణాలను స్వాధీనం చేసుకుని, మొత్తం దేశాన్ని మావోయిస్టు రాజ్యంగా మార్చ డం అన్నది ఎంత అమాయకపు ఆలోచనో మనవాళ్లకు ఇంకా ఎందుకు అర్థం కావ డం లేదు? 1949లో చైనా విముక్తికోసం మావో అనుసరించిన రైతాంగ సాయుధ పోరాట పరిస్థితులు నేడున్నాయా? రోడ్డు, రవాణా,

కమ్యూనికేషన్, నిఘా... ఏ వ్యవ స్థలూ అందుబాటులో లేని ఆ కాలంలో మావో ముందుగా గ్రామీణ ప్రాంతాలను, ఆ తర్వాత పట్టణాలను విముక్తి చేసి చైనాలో విప్లవ విజయం సాధించారు. అదే విధానాన్ని కొనసాగించడం 1950లోనే తెలంగాణలో సాధ్యం కాలేదు. 1970లలోనే సాధ్యం కాలేదు. ఇప్పుడెలా సాధ్యమవుతుందని ఆ యువకులను బలిపీఠంపైకి ఎక్కిస్తున్నారు? గట్టు మీద కూర్చుని గట్టి మాటలు చెప్పడం సులువే. నమ్మి ఆచరించేవారు, బలైపోతున్నవారు మావోయిస్టులు. నమ్మకం లేకపోయినా సానుభూతి చూపేవారు మానవతావాదులు. గతం, వర్తమానం అంతా రక్తంతో తడిసిన చేతులతో కరచాలనం చేసినవాళ్లు, చేస్తున్నవాళ్లు విప్లవం గురించి మాట్లాడటమే వంచన. తప్పును తప్పని చెప్పకపోవడం, అంతిమ ఫలితాలు తెలిసీ వారిని నిప్పుల కుంపటిలోకి తోయ డం నేరం. సాయుధ పోరాట పంథా తప్పని చెబితే త్యాగాలు చేసిన వారిని కించపర్చడం కాదు. తప్పని చెప్పినంత మాత్రాన పోరాటం ఆగిపోతుందనీ కాదు. కానీ విచక్షణాపరులు చేయవలసిన పని చేయకపోతే అది ఆ సమాజానికి చేటు చేస్తుంది. చివరికి దుఃఖం, సంతాపాలు మిగులుతాయి.


ఎన్‌కౌంటర్ నిజమో కాదో తెలియదు. పోలీసులు ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అని చెబుతున్నారు. చేతికి చిక్కిన వారిని చిత్రవధ చేసి చంపారని మావోయిస్టు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకటి మాత్రం వాస్తవం ఎన్‌కౌంటర్ చేసిన తీరు, శృతి, విద్యాసాగర్‌ల మృతదేహాలను ఛిద్రం చేసిన తీరు చూస్తే అది కేవలం ఎన్‌కౌంటర్‌లాగా లేదు. ఏదో శత్రుదేశ సైనికులపై దాడి చేసి కసి తీర్చుకున్నట్టనిపించింది. పోలీసు లు ఏ యుద్ధ నీతినీ పాటించలేదు. మనిషిని చంపడానికి ఒక్క బుల్లెట్, అయినా వంద బుల్లెట్‌లు అయినా తేడా ఏమీ ఉండదు. కానీ పోలీసులు అణువణువూ ఛిద్రం చేసేంత దౌష్ట్యాన్ని వారి శరీరాలపై చూపించారు. కనీసం మనుషులుగా వ్యవహరించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి ఇటువంటి పరిస్థితి ఎదురుపడినప్పుడు పోలీసులు పరిస్థితిని సంయమనంతో ఎదుర్కోవలసింది. శృతి, వివేక్, సాగ ర్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారు. వారిని సజీవంగా పట్టుకుని సమాజం ముందు పెట్టి, తెలంగాణలో ఇటువంటి కార్యకలాపాలను అంగీకరించబోమని చెప్పి ఉండవలసింది. మారడానికి వారికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది. మన రాష్ట్రం మనం సాధించుకున్నాం. నిన్నగాక మొన్న వచ్చిన రాష్ట్రంపై యుద్ధం చేయాల్సిన అవసరం ఏమిటి? ఇప్పటిదాకా చేసిన త్యాగాలు చాలు. ఇప్పుడు మీరు త్యాగా లు చేయాల్సిన అవసరం లేదన్న సందేశాన్ని ఈ సందర్భంగా యువతకు పంపి ఉంటే బాగుండేది. మొదలు పెట్టడమే సంహారంతో మొదలుపెట్టారు. ఎంత బీభత్సంగా చంపితే అంత భయపడతారని పోలీసులు భావిస్తుండవచ్చు. కానీ చరిత్రలో ఎప్పు డూ అలా జరగలేదు. యువకులు మరింత రిపల్సివ్‌గా తిరగబడతారని ఎందుకు అర్థం కావడం లేదు? ఇంత ఆధునిక యుగంలో కూడా ఈ అనాగరిక యుద్ధ నీతి ఎందుకు? మన రాష్ట్రం ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణను కోరుకోవడం నిజమే. అంటే మావోయిస్టుల అవసరం లేని తెలంగాణను కోరుకోవడం. సాయుధ పోరాటం అవసరం లేని తెలంగాణను కోరుకోవడం. సాయుధ మావోయిస్టులను స్వేచ్ఛగా తిరగనిచ్చే తెలంగాణ కాదు అన్న వాస్తవాన్ని కూడా వారిని సమర్థించేవారు గ్రహించాలి. తెలంగాణ ఇప్పటివరకు అనుభవించిన క్షోభ చాలు. ఇప్పటి వరకు చేసిన త్యాగాలు చాలు. అత్యంత చైతన్యవంతులైన, క్రియాశీలురైన, సాహసులైన యువకులు, సమాజానికి గొప్పగొప్ప పనులు చేసిపెట్టగల యువకులు వేలాదిమంది ఇలా అడవిదారిలో నేలకొరగడం ఎంతమాత్రం మంచిది కాదు.

తెలంగాణ సాయుధపోరాటాన్ని ప్రారంభించిన రావి నారాయణరెడ్డి, ఈ త్యాగా లు, రక్తపాతం ఇక చాలు. ఇంకా సాయుధ పోరాటం కొనసాగించడానికి తరుణం కాదు అన్న పాపానికి పార్టీ డబ్బులతో పరారయిన రావి నారాయణరెడ్డి అని ఆనాడే పత్రికల్లో రాయించారు కొందరు సాయుధ పోరాట ప్రేమికులు. చైనా మార్గమే మన మార్గమని నమ్మి, విముక్తి ప్రాంతాలను కాపాడుకోవడానికి సాయుధ పోరాటం కొనసాగించాలని జాతీయ కమ్యూనిస్టు పార్టీతో తీర్మానం చేయించి తెలంగాణను బలిపీఠంగా మార్చేశారు అప్పటికి తెలంగాణ కమ్యూనిస్టు పార్టీపై పెత్తనం చేస్తున్న కొంద రు ఆంధ్రా కమ్యూనిస్టు నాయకులు. దళాల్లో సాయుధ పోరాటాన్ని విరమిద్దామని అన్న పాపానికి కొంత మంది కామ్రేడ్లను దారుణంగా కాల్చి చంపారు. దళాల్లో సభ్యు ల సంఖ్య తగ్గిపోయింది. గ్రామాల్లో ప్రజలు కూడా స్వాతంత్య్రం వచ్చింది ఇంకెందుకు ఈ పోరాటం అన్న భావనతో దళాలకు సహకరించడం మానేశారు. అట్టడుగుస్థాయిలో వచ్చిన మార్పులను గమనించకుండా సాయుధపోరాటం కొనసాగించడం తప్పని రావి నారాయణరెడ్డి పార్టీ పెద్దలకు నివేదించడానికి బొంబాయి వెళ్లారు. ఆంధ్ర నాయకత్వంపై నమ్మకం లేక ఆయన బొంబాయికి వెళ్లారని వేరే చెప్పనవసరం లేదు. అలా వెళ్లినందుకు ఆయనను ఎన్నిరకాల వేధించాలో అన్ని రకాలుగా వేధించింది సాయుధ పోరాటాన్ని వెనుకేసుకొచ్చిన అతివాద ముఠా ఆయనను కేంద్ర కమిటీ నుంచి తొలగించింది. బొంబాయి నుంచి కదలవద్దంది. ఆయన ఖర్చులు ఆయనే భరించుకోవాలని చెప్పింది. ఎవరూ ఆయనను కలవకుండా కట్టడి చేసింది. చివరికి 1951లో ఆయన చెప్పిన మార్గానికే వచ్చి సాయుధ పోరాటాన్ని విరమించింది కమ్యూనిస్టు పార్టీ. రావి నారాయణ రెడ్డి రాష్ర్టానికి చేరే సమయానికి ఆయనపై చేయాల్సిన దుష్ప్రచారమంతా చేసిపెట్టింది సాయుధ పోరాటాన్ని సమర్థించిన గుంపు. పిరికివాడని, పారిపోయాడని, అమ్ముడుపోయాడని, రెనెగేడ్ అనీ.. ఎన్ని పేర్లు పెట్టాలో అన్ని పేర్లు పెట్టారాయనకు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది. కానీ పార్టీలో చండ్ర రాజేశ్వర్‌రావు వంటి చాలా మంది సీనియర్ నాయకులు తమ తప్పిదాలను గుర్తించి 1952 ఎన్నికల్లో ఆయనకు పార్లమెంటు టికెట్ ఇచ్చారు. అతివాద ముఠా కూడా రావి నారాయణ రెడ్డి ఎలాగూ ఓడిపోతాడని భావించి ఆయన అభ్యర్థిత్వానికి ఎదురు చెప్పలేదు. కానీ ఎన్నికలలో నల్లగొండ ప్రజలు రావి నారాయణ రెడ్డికి మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కంటే అధిక మెజారిటీని కట్టబెట్టి భారత ఎన్నికల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. సాయుధ పోరాటం ఇప్పుడు ఇక్కడ సరిపోదని ప్రకటించిన రావి నారాయణరెడ్డిని నల్లగొండ ప్రజలు ఎందుకు గెలిపించినట్టు? అరవై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కూడా తిరిగి ఇదే చర్చ. సాయుధ పోరాటం ఇప్పుడు ఆచరణ సాధ్యమా? కాదని చెప్పే ధైర్యం లేదు.

ఆచరణ సాధ్యం కాని ఆయుధాలు పట్టుకోవడం, కాలుతుందని తెలిసి మంటల్లో దూకడం, అంతిమ ఫలితాలు పదేపదే ఇలాగే ఉంటున్నాయని అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా బలిపీఠంపైకి ఎక్కడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అడవుల్లో పాఠాలు చెప్పుకోవడానికి, గిరిజనులకు వ్యవసాయం, విద్యాబుద్ధులు చెప్పడానికి వెళితే ఎవ రూ అభ్యంతర పెట్టరు. దేశంలో నడిమధ్యన నాలుగు జిల్లాల పరిధిలో తుపాకులతో ప్రవేశించి ఇది జనతన రాజ్యమని ప్రకటించి, సరిహద్దులు గీసి, ఇది దాటివస్తే శిక్షలు ఉంటాయని చెప్పిన తర్వాత ఈ చిన్న రాజ్యం చుట్టూ ఉన్న పెద్ద రాజ్యం చూస్తూ ఊరుకుంటుందని ఎలా అనుకుంటున్నారు? ఒక వర్గం మీడియా, సీపీఎంతో సహా కొన్ని రాజకీయపార్టీలు ఇప్పుడు విప్లవగీతాలు ఆలాపించవచ్చు. కానీ వారి చరిత్రను ఎవరూ తుడిపేయలేరు. మేము ప్రభుత్వాలను శాసిస్తాం. నడిపిస్తాం. కాళ్లదగ్గరకు తెచ్చుకుంటాం. ఎవరినయినా లొంగ దీసుకుంటాం అని భ్రమించిన మీడియా తెలంగాణలో అది సాగకపోయే సరికి భంగపడి విచ్చలవిడిగా తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నది. అందుకు ఏ సందర్భం దొరికినా అది వదలడం లేదు. మావోయిస్టులపై వారి విపరీత ప్రేమ కూడా అందులో భాగమే. ఆ మీడియా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వంద అబద్ధాలను చెబుతుంది.

లేని పెద్దరికాన్ని మీద వేసుకుని, తెలంగాణకోసం తామేదో పొడిచామని చెప్పుకోడానికి అబద్ధాలను కుమ్మరిస్తున్నది. మీడి యా అధిపతులు పైరవీలు చేస్తే గద్దర్ వంటి వారు అంగీకరించి దీక్ష విరమించాల్సిందిగా కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారని ఎవరయినా నమ్మితే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. సీపీఎంది కూడా ఈ మీడియాధిపతి లక్షణమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఏకైక పార్టీగా ఆ పార్టీ గత కొన్నేళ్లలో చాలా పేరు మూటగట్టుకుంది. మావోయిస్టులను ఊచకోత కోసిన పార్టీగా కూడా వారికి ఘనమైన చరిత్రే ఉంది. ఇప్పుడు అవన్నీ మరిపించడానికి మావోయిస్టులను మించిన మావోయిస్టు పార్టీగా ఆ పార్టీ ప్రవర్తిస్తున్నది. చెదిరిపోయిన శ్రేణులను పోగేసుకోవడానికి, మసకబారిన ప్రతిష్టను పునరుద్ధరించుకోవడానికి ఆ పార్టీ ఎవరో ఉసిగొల్పిన పందెంకోడిలాగా కాలు దువ్వుతున్నది. అయితే ప్రజలకు ఇవన్నీ అర్థం కాకుండా పోవు. వీరంతా తెలంగాణను విఫలం చేయడానికి పాటుపడుతున్నారా సఫలం చేయడానికి తోడ్పడుతున్నారా అన్నది జనానికి మెల్లగానయినా తెలిసి వస్తుంది. ఒక మౌనం నియంతృత్వానికి దారితీస్తుందని కొందరు బాధపడిపోతున్నారు. నిజమే మాట్లాడితే విద్రోహుల ముద్ర పడిపోతుందేమోనని చాలా మంది మౌనం వహిస్తుండవచ్చు. మాట్లాడకపోతే భావజాల నియంతృత్వం రాజ్యం చేస్తుందన్నదీ నిజం.


kattashekar@gmail.com  
Related Posts Plugin for WordPress, Blogger...